తల్లీ కూతుళ్ళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-13T19:49:12+05:30 IST

జిల్లాలోని పెదకూరపాడు మండలంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. మండలంలోని

తల్లీ కూతుళ్ళ ఆత్మహత్య

గుంటూరు: జిల్లాలోని పెదకూరపాడు మండలంలో ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. మండలంలోని ముస్సాపుర గ్రామంలో తల్లీకూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి నాగవర్దిని (40), కూతురు దివ్యశ్రీ (20) గత రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను అమరావతి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-04-13T19:49:12+05:30 IST