కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-19T05:43:05+05:30 IST

కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ మండలం మాచవరంలో ఆదివారం జరిగింది

కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య

మెదక్‌ రూరల్‌, ఏప్రిల్‌ 18: కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ మండలం మాచవరంలో ఆదివారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన తిమ్మాపూర్‌ అశోక్‌(35) భార్య సుజాత, పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అత్తవారి ఇళ్లైన కుకునూర్‌కు వెళ్లాడు. ఆదివారం తిరిగొచ్చిన అశోక్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న విషయంలో ఏర్పిడన మనస్పర్థలను అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మెదక్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


 

Updated Date - 2021-04-19T05:43:05+05:30 IST