అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-06T09:32:20+05:30 IST
అప్పులబాధతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన బొమ్మనబోయిన ఆవులయ్య
పెద్దారవీడు(మార్కాపురం)/తాడికొండ, మార్చి 5: అప్పులబాధతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన బొమ్మనబోయిన ఆవులయ్య (36) తన ఎకరన్నర పొలంలో మూడేళ్లలో ఆరు బోర్లు వేయించాడు. ఈ క్రమంలో రూ.15లక్షల వరకు అప్పులపాలై గురువారం రాత్రి పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసు కున్నాడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన కౌలురైతు ముద్రబోయిన నాగరాజు(30) రుణదాతల ఒత్తిడితో మనస్తాపానికి గురై ఫిబ్రవరి 28న గడ్డిమందు తాగాడు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.