అప్పుల బాధతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-03T05:08:31+05:30 IST
సీతాయిపేట్ గ్రామానికి చెందిన ఒడ్డెటి శంకర్ (38) అనే వ్యక్తి ఉరివేసుకొని మృతిచెందినట్లు ఎస్సై పాండేరావు బుధవారం తెలిపారు.
ధర్పల్లి, డిసెంబరు 2: సీతాయిపేట్ గ్రామానికి చెందిన ఒడ్డెటి శంకర్ (38) అనే వ్యక్తి ఉరివేసుకొని మృతిచెందినట్లు ఎస్సై పాండేరావు బుధవారం తెలిపారు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిన శంకర్ పొలం వద్ద గల మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అప్పుల బాధతో మద్యానికి బానిసై ఇంట్లో తరుచూ కుటుంబసభ్యులతో గొడవ పడేవాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.