తండ్రి మందలించాడని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-18T05:30:00+05:30 IST

తండ్రి మందలించాడని బావిలో దూకి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి మందలించాడని ఆత్మహత్య
పాపయ్య మృతదేహం

చిన్నశంకరంపేట, జనవరి 18 : తండ్రి మందలించాడని బావిలో దూకి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం చిన్నశంకరంపేటకు చెందిన విభూతి పాపయ్య (26) భార్య దీనతో తరచూ గొడవ పడేవాడు. అయితే వారంరోజుల క్రితం దీన తల్లిగారి ఊరైన చేగుంటకు వెళ్లింది. సోమవారం సాయంత్రం పాపయ్య కూడా వెళ్లాడు. కాగా మంగళవారం ఉదయం భార్యాభర్తలు, దీన తల్లి కలిసి చిన్నశంకరంపేటకు చేరుకున్నారు. ఈ క్రమంలో పాపయ్య తండ్రి ఎందుకు గొడవలు పడుతున్నారని, కలిసి ఉండాలని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన పాపయ్య గ్రామ శివారులోని ఓ పాత బావిలో తండ్రి కళ్లముందే దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల సహాయంతో బావిలోంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య దీన, కూతురు మౌనిక, కుమారుడు కార్తీక్‌ ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ గౌస్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST