హైదరాబాద్ కార్మికనగర్లో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-01T16:20:21+05:30 IST
కార్మికనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఎన్ఐఎస్ఈఐటీ గ్రౌండ్స్లో చెట్టుకు ఉరివేసుకుని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం
హైదరాబాద్: కార్మికనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఎన్ఐఎస్ఈఐటీ గ్రౌండ్స్లో చెట్టుకు ఉరివేసుకుని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కార్మికనగర్కు చెందిన గణేష్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. మృతుడి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.