ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ పీతల సుజాత
ABN , First Publish Date - 2021-06-13T01:49:56+05:30 IST
ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం లాండ్, సాండ్
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం లాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాతో వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అస్తి పన్ను పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనా వలన ఇప్పటికే కుదేలయిన మద్య తరగతి వాళ్ళకు ఇప్పుడు పెంచిన ఆస్తి పన్ను ఇంకా భారంగా మారుతుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సృష్టించడం చేతకాక ప్రజలని దోచుకుంటున్నారని పీతల సుజాత దుయ్యబట్టారు.