వైఎస్, జగన్ తెలంగాణ పాలిట శత్రువులు
ABN , First Publish Date - 2020-05-29T10:15:15+05:30 IST
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తండ్రీకొడుకులు వైఎస్, జగన్ శత్రువులుగా మారారని శాసనమండలి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నాగార్జునసాగర్ / చింతపల్లి, మే28 : తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తండ్రీకొడుకులు వైఎస్, జగన్ శత్రువులుగా మారారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాగర్ హిల్కాలనీలో రెడ్డి సంక్షేమ భవన్లో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ పనులు పరిశీలించారు. విజయ్విహార్ అతిథి గృహంలో స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ తరువాత సాగర్లో నివాసముంటున్న వెల్మగూడెం మాజీ సర్పంచ్ దాచిరెడ్డి మాధవరెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చింతపల్లి మండలంలోని వీటీనగర్కు చెందిన టీఆర్ఎస్ జిల్లా నేత బాదేపల్లి పులిరాజుగౌడ్ కుటుంబసభ్యులను సుఖేందర్రెడ్డి పరామర్శించారు.