వైసీపీ కార్యకర్త అరాచకం.. వెంటాడి.. వేట కొడవలితో దాడి చేసి..
ABN , First Publish Date - 2021-01-19T17:44:01+05:30 IST
సూళ్లూరుపేటలో ఆదివారం అర్ధరాత్రి వైసీపీకి చెందిన..
నెల్లూరు(ఆంద్రజ్యోతి): సూళ్లూరుపేటలో ఆదివారం అర్ధరాత్రి వైసీపీకి చెందిన ఓ కార్యకర్త తన స్నేహితులతో కలిసి ఓ యువకుడిపై వేట కొడవలితో దాడిచేశాడు. కత్తి వేటును తప్పించుకునేందుకు ఆ యువకుడు చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి తీవ్రగాయమైంది. బాధితుడు, పోలీసుల సమాచారం మేరకు... మాంబట్టు విద్యుత్ సబ్స్టేషన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తున్న కె. వెంకటేశ్వర్లు (26) ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితులు గోపీకృష్ణ, సాయిలతో కలసి బైక్పై వె ళ్తుండగా మన్నారుపోలూరుకు చెందిన రాకేష్ అనే యువకుడు, మరో 10 మంది స్నేహితులతో కలిసి మోటారు సైకిళ్లపై వారిని వెంబడించారు. ఫ్లైఓవర్ వంతెన చివరన కోళ్లమిట్ట వద్ద అడ్డగించి వెంకటేష్ చొక్కాపట్టి లాగారు. ఎందుకు పట్టుకున్నారని వెంకటేశ్వర్లు ప్రశ్నిస్తుండగా రాకేష్ వేట కొడవలితో దాడి చేశాడు. ఆ కత్తివేటును తప్పించుకునేందుకు వెంకటేశ్వర్లు చెయ్యి అడ్డుపెట్టడంతో అతని చేతికి తీవ్ర గాయమైంది.
ఈ ఘటనతో వెంకటేశ్వర్లు స్నేహితులు భయపడి పారిపోయారు. రాకేష్ గ్యాంగ్ వెంకటే్షను చుట్టుముట్టి దాడిచేశారు. ఇంతలో పరారైన వెంకటేశ్వర్లు స్నేహితులు ఆ ప్రాంతంలోని పలువురుతో కలిసి అక్కడకు రావడంతో రాకేష్ గ్యాంగ్ పరారైంది. బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. రాకే్షతోపాటు అతని స్నేహితులు జయరామ్, బాలాజీ, దేవా, జూనియర్ రాకే్షలతోపాటు మరో ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సూళ్లూరుపేట ఇన్చార్జి ఎస్ఐ మనోజ్కుమార్ తెలిపారు. టీడీపీ అభిమాని అయిన బాధితుడికి వైసీపీకి చెందిన రాకే్షతో చిన్నపాటి గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అతనిపై వేట కొడవలితో దాడిచేసినట్లు సమాచారం.
కొసమెరుపు
వెంకటేశ్వర్లుపై దాడిచేసిన నిందితుడు రాకేష్ ఫొటోలు సోమవారం ఇళ్లపట్టాల పంపిణీకి వి చ్చేసిన కలెక్టర్ చక్రధర్బాబును స్వాగతిస్తూ వైసీపీ ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలలో ఉన్నాయి.