ఆస్పత్రిలో రోగి సహాయకురాలితో అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2021-04-06T16:08:09+05:30 IST

రోగికి సహాయంగా వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై

ఆస్పత్రిలో రోగి సహాయకురాలితో అసభ్య ప్రవర్తన

  • సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రి 
  • హెడ్‌ నర్స్‌, సెక్యూరిటీపై కేసు

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : రోగికి సహాయంగా వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై సుల్తాన్‌ బజార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన లక్ష్మి తన కోడలు సుష్మాను కాన్పు నిమిత్తం గత నెల 30న కోఠి సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చింది. బిడ్ద పుట్టాక చిన్న పాటి ఆరోగ్య సమస్యలు ఉండడంతో వైద్యులు తల్లిని ఒక వార్డుకు, పాపను మరో వార్డుకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.


లక్ష్మి వినతి మేరకు ఆమెకు పరిచయం ఉన్న వైద్యుడు ఆస్పత్రి సిబ్బందికి ఫోన్‌ చేసి సుష్మా, ఆమె పాపకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీంతో కోపం పెంచుకున్న అక్కడి హెడ్‌ నర్సు అన్నపూర్ణి సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి లక్ష్మిని మందలించాలని చెప్పింది. దీంతో సాయి అనే సెక్యూరిటీ సిబ్బంది తన చేయిపట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు  ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అన్నపూర్ణ, సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-04-06T16:08:09+05:30 IST