మూడు నెలల క్రితం పెళ్లి.. భార్యతో పాటు అత్తారింటికి.. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి..

ABN , First Publish Date - 2021-10-03T19:30:25+05:30 IST

అతడికి పెళ్లయి మూడు నెలలయింది. భార్యతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ నవదంపతులు కలిసి అత్తారింటికి వెళ్లారు. కూతురిని, అల్లుడిని చూసి కుటుంబసభ్యులు సంబరపడిపోయారు. అల్లుడికి చేయాల్సిన

మూడు నెలల క్రితం పెళ్లి.. భార్యతో పాటు అత్తారింటికి.. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి..

అతడికి పెళ్లయి మూడు నెలలయింది. భార్యతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ నవదంపతులు కలిసి అత్తారింటికి వెళ్లారు. కూతురిని, అల్లుడిని చూసి కుటుంబసభ్యులు సంబరపడిపోయారు. అల్లుడికి చేయాల్సిన మర్యాదలన్నీ చేశారు. ఇద్దరూ అప్పటి వరకు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఆ రోజు ఎవరికీ చెప్పకుండా సడెన్‌గా ఎక్కడికో వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఇంతకీ అతడు ఏమయ్యాడంటే..


ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లా ఖైర్‌జితి గ్రామానికి చెందిన రిషి పటేల్(22)కు భిలాయ్‌లోని ధందా గ్రామానికి చెందిన ఓ యువతితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో గత నెల 29న నవదంపతులు యువతి పుట్టింటికి వెళ్లారు. అక్కడ వారు అల్లుడికి అన్ని మర్యాదలు చేశారు. ఆ రోజు వరకు ఇద్దరు చాలా హ్యాపీగా గడిపారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం ఎవరికీ చెప్పకుండా రిషి బయటికి వెళ్లాడు. చాలా సమయం గడిచినా అతడు తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడి కుటుంబసభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. తెలిసిన చోట ఉన్నాడేమో అని అక్కడకు వెళ్లి చూశారు. అయినా కనిపించలేదు.


అదే రోజు రాత్రి 11.30గంటలకు రిషి తన సోదరుడికి ఫోన్ చేసి తాను పురుగుల మందు సేవించినట్లు చెప్పాడు. దీంతో హుటాహుటిన అతడి కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ధందా ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం భిలాయ్‌కి తరలించారు. రిషి అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-10-03T19:30:25+05:30 IST