రాష్ట్రస్థాయి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యుడిగా సునందనరెడ్డి
ABN , First Publish Date - 2021-05-14T05:28:12+05:30 IST
గిడ్డంగివారిపల్లె వాసి డాక్టర్ మాచిరెడ్డి సునందనరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యుడిగా కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
వేంపల్లె, మే 13: గిడ్డంగివారిపల్లె వాసి డాక్టర్ మాచిరెడ్డి సునందనరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యుడిగా కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్ మాచిరెడ్డి సునందనరెడ్డి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ అందు కున్నారు. ప్రస్తుతం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల నంద్యా లలో సివిల్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మం డలంలోని మారుమూల ప్రాంతం నుంచి ఉన్నతమైన పదవిని అందుకోవడం పట్ల గ్రామస్థులు, స్నేహితులతో పాటు పలువురు అభినందించారు.