ఏ అధికారంతో మాట్లాడుతున్నావ్‌?

ABN , First Publish Date - 2020-04-06T09:37:48+05:30 IST

భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రాపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ విరుచుకుపడ్డాడు. కరోనా కారణంగా ప్రపంచ క్రికెట్‌ స్తంభించిపోవడంతో ...

ఏ అధికారంతో మాట్లాడుతున్నావ్‌?

ఐసీఏ చీఫ్‌పై గవాస్కర్‌

ముంబై: భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రాపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ విరుచుకుపడ్డాడు. కరోనా కారణంగా ప్రపంచ క్రికెట్‌ స్తంభించిపోవడంతో బీసీసీఐకి ఆదాయం తగ్గిపోయిందని, దీంతో ఆటగాళ్లు తమ జీతాల్లో కోత విధించుకోవాలని ఇటీవల మల్హోత్రా సూచించాడు. ‘ఆయన బీసీసీఐకి బాకా ఊదడం మానేయాలి. ఏ అధికారంతో ఆటగాళ్ల జీతాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుత అంతర్జాతీయ, ఫస్ట్‌ క్లాస్‌ ఆటగాళ్లలో ఎవరూ కూడా ఐసీఏలో సభ్యులు కారు. అలాంటప్పుడు వారి గురించి మాట్లాడే హక్కు ఆయనకెక్కడిది? అయినా తమ జేబుకు చిల్లు పడనంత కాలం ఇతరుల వేతనాల కోతలపై మాట్లాడడం తేలికే’ అని సన్నీ ఘాటుగా స్పందించాడు.

Updated Date - 2020-04-06T09:37:48+05:30 IST