ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఎవరో చెప్పిన సునీల్ గవాస్కర్

ABN , First Publish Date - 2020-09-19T02:25:35+05:30 IST

రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మ్యాచ్ విన్నర్లు ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పేశాడు. విరాట్

ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఎవరో చెప్పిన సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మ్యాచ్ విన్నర్లు ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పేశాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, క్రిస్ మోరిస్ వంటి ఆటగాళ్లతో ఆర్సీబీ జట్టు బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా టైటిల్ చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన గట్టి పట్టుదలగా ఉంది. న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్ వంటి థింక్ ట్యాంక్‌ సపోర్ట్ స్టాప్ అండగా ఉంది.


విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి వారు ఉన్న జట్టు ఇప్పటికీ టైటిల్ గెలవకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. వారిద్దరూ ఉన్న జట్టు పరుగులు తక్కువగా చేయకూడదని, కొన్నిసార్లు అదే సమస్యగా మారుతుందని పేర్కొన్నాడు. ఒకవేళ వీరిద్దరూ విఫలమైతే, మిగతా వారు కూడా చేతులెత్తేస్తారని చెప్పుకొచ్చాడు.


ఈసారి వారికి కొత్త కోచ్ రావడం కలిసి వచ్చే అంశమని వివరించాడు. అలాగే, కోహ్లీ, డివిలియర్స్‌ మ్యాచ్ విన్నర్లు కాదని, దుబాయ్ పిచ్‌లపై బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్ విన్నర్ కాగలడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.   


Updated Date - 2020-09-19T02:25:35+05:30 IST