ఢిల్లీపై రైజర్స్ విజయం
ABN , First Publish Date - 2020-09-30T05:02:08+05:30 IST
ఐపీఎల్-2020లో సన్రైజర్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో...
దుబాయ్: ఐపీఎల్-2020లో సన్రైజర్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ గెలుపులో తొలుత బెయిర్ స్టో(48 బంతుల్లో 53)తో మెరవగా.. వార్నర్(33 బంతుల్లో 45), విలియమ్సన్(26 బంతుల్లో 41) రాణించారు. తరువాత బౌలింగ్లో రషీద్ ఖాన్ స్పిన్తో మాయ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో టోర్నీలో ఢిల్లీ తొలి ఓటమి చవి చూసింది.