మళ్లీ వార్నర్కు సన్రైజర్స్ పగ్గాలు
ABN , First Publish Date - 2020-02-28T09:58:36+05:30 IST
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. 2016లో తన సారథ్యంలోనే సన్రైజర్స్ను విజేతగా నిలిపిన 33 ఏళ్ల వార్నర్.. బాల్ టాంపరింగ్ వివాదంతో 2018 సీజన్కు దూరమయ్యాడు. వార్నర్ గైర్హాజరీలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. గతేడాది తిరిగి జట్టులో చేరినా.. వార్నర్కు సన్రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీ అప్పగించలేదు. ఈసారి వార్నర్నే కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1న ఉప్పల్ స్టేడియంలో ముంబైతో సన్రైజర్స్ తొలి మ్యాచ్ను ఆడనుంది.