ఈసారి మండనున్న ఎండలు!

ABN , First Publish Date - 2021-03-02T07:21:53+05:30 IST

ఈ వేసవిలో ఉత్తర, ఈశాన్య, వాయువ్య భారతం మండనుంది. మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. అయితే, దక్షిణ, మధ్య భారతంలో

ఈసారి మండనున్న ఎండలు!

దక్షిణ, మధ్య భారతంలో తక్కువే


న్యూఢిల్లీ, మార్చి 1: ఈ వేసవిలో ఉత్తర, ఈశాన్య, వాయువ్య భారతం మండనుంది. మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. అయితే, దక్షిణ, మధ్య భారతంలో మాత్రం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. మధ్య భారతంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, గుజరాత్‌, కోస్తా మహారాష్ట్ర, గోవా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండే అవకాశముందని పేర్కొన్నది. ఆ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని తెలిపింది. 

Updated Date - 2021-03-02T07:21:53+05:30 IST