‘బాధిత కుటుంబాలను ఆదుకోండి’

ABN , First Publish Date - 2021-06-14T04:17:05+05:30 IST

‘బాధిత కుటుంబాలను ఆదుకోండి’

‘బాధిత కుటుంబాలను ఆదుకోండి’
సమావేశంలో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘ నాయకులు

కలెక్టరేట్‌, జూన్‌ 13 : కరోనాతో మృతి చెందిన నాలుగో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే బెనిఫిట్స్‌  ఇప్పించాలని సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. బాఽధిత  కుటుంబాలను  ఆదుకోవాలని కోరారు. ఆదివారం పట్టణంలోని నాలుగో తరగతి ఉద్యోగుల భవనంలో  సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా  వారు మాట్లాడుతూ.. నాలుగో  తరగతి ఉద్యోగులకు శానిటైజర్లు, మాస్క్‌లు ఇప్పించాలని,  సమస్యలు  పరిష్కరించాలని కోరారు.  సమావేశంలో  సంఘం నాయకులు కంది లక్ష్మణరావు, సుందర అప్పల నర్సయ్య, రామలక్ష్మి, మువ్వల గంగాప్రసాద్‌, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు. 

 


Updated Date - 2021-06-14T04:17:05+05:30 IST