అమరావతి ఉద్యమానికి మద్దతివ్వండి
ABN , First Publish Date - 2021-04-21T09:54:37+05:30 IST
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం కొనసాగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ మంగళవారం వైఎస్ షర్మిలకు లేఖ రాశారు.
- -షర్మిలకు సుంకర పద్మశ్రీ లేఖ
విజయవాడ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పరిరక్షణ కోసం కొనసాగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ మంగళవారం వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. కనీసం పత్రికా ప్రకటన చేసినా అమరావతి ఉద్యమానికి మేలు చేసినవారవుతారని ఆమె పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్తో 491 రోజులుగా తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాలని కోరారు. షర్మిలను స్వయంగా కలిసేందుకు అమరావతి మహిళా జేఏసీ ప్రతినిధి బృందం ఎదురు చూస్తున్నదని తెలిపారు.