ఆసరా.. ఆలస్యం!

ABN , First Publish Date - 2022-05-31T05:49:39+05:30 IST

కొన్నినెలలుగా ఆసరా పింఛన్ల పంి పణీలో ఆలస్యం నెలకొంటుంది. ప్రతినెలా మొదటివారంలో రావాల్సిన ఆసరా పింఛన్లు నెల చివరికైనా రావడం లేదు. పండుటాకులకు ప్రతినె లా ప్రదక్షిణలు, పడిగాపులు తప్పడం లేదు. నెలాఖరు వచ్చిన ఆసరా దక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మొదటి వా రంలో ఇవ్వాల్సిన డబ్బులు మరుసటి నెలలో పంపిణీ చేస్తున్నారు. 5 నెలలుగా ఇదేతంతూ కొనసాగుతుంది. ఇదే విషయమై లబ్ధిదారులు సంబంధిత శాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావడం లేదని, సర్వర్‌ డౌన్‌ ఉంటుందని వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. జి ల్లావ్యాప్తంగా మొత్తం 1,47,521 ఆసరా పింఛన్లు ఉండగా ఇందుకు గా ను ప్రభుత్వం రూ.31.49 కోట్ల నిధులను కేటాయిస్తోంది. సకాలంలో ఆ సరా డబ్బులు ఖాతాలో జమకాకపోవడం, పోస్టాఫీస్‌ నిర్వాహకులు ఇవ్వ కపోవడంతో రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది

ఆసరా.. ఆలస్యం!

సకాలంలో అందని ఆసరా పింఛన్లు

వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు

పోస్టాఫీసుల చుట్టూ నిత్యం ప్రదక్షణలు

జిల్లాలో ఐదునెలలుగా ఇదే పరిస్థితి

పట్టించుకోని సంబంధితశాఖ అధికారులు

జిల్లాలో మొత్తం 1.47 లక్షల పింఛన్లు

దోమకొండలో పింఛన్‌ డబ్బుల కోసం క్యూలైన్‌లో నిల్చున్న లబ్ధిదారులు

కామారెడ్డి, మే 30(ఆంధ్రజ్యోతి): కొన్నినెలలుగా ఆసరా పింఛన్ల పంి పణీలో ఆలస్యం నెలకొంటుంది. ప్రతినెలా మొదటివారంలో రావాల్సిన ఆసరా పింఛన్లు నెల చివరికైనా రావడం లేదు. పండుటాకులకు ప్రతినె లా ప్రదక్షిణలు, పడిగాపులు తప్పడం లేదు. నెలాఖరు వచ్చిన ఆసరా దక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మొదటి వా రంలో ఇవ్వాల్సిన డబ్బులు మరుసటి నెలలో పంపిణీ చేస్తున్నారు. 5 నెలలుగా ఇదేతంతూ కొనసాగుతుంది. ఇదే విషయమై లబ్ధిదారులు సంబంధిత శాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావడం లేదని, సర్వర్‌ డౌన్‌ ఉంటుందని వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. జి ల్లావ్యాప్తంగా మొత్తం 1,47,521 ఆసరా పింఛన్లు ఉండగా ఇందుకు గా ను ప్రభుత్వం రూ.31.49 కోట్ల నిధులను కేటాయిస్తోంది. సకాలంలో ఆ సరా డబ్బులు ఖాతాలో జమకాకపోవడం, పోస్టాఫీస్‌ నిర్వాహకులు ఇవ్వ కపోవడంతో రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది

జిల్లాలో 1.47 లక్షల ఆసరా  లబ్ధిదారులు..

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జు క్కల్‌ నియోజకవర్గాల పరిధిలో ఆయా విభాగాలకు చెందిన మొత్తం ఆసరా లబ్ధిదారులు 1,47,521 మం ది ఉన్నారు. వీరికి ప్రతినెలా ప్రభుత్వం రూ.31.49 కోట్లు పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛ న్లు 38,806 ఉండగా, రూ.7.82 కోట్లు పంపిణీ చేస్తుండగా వితంతు పింఛన్లు 47,044 ఉండగా రూ. 9.48 కోట్లు దివ్యాంగుల పింఛన్లు 17,538 ఉండగా రూ.5.28 కోట్లు, చేనేత కార్మికుల పింఛన్లు 597 ఉం డగా రూ.1.2 కోట్లు, కల్లుగీత కార్మికుల పింఛన్లు 680 ఉండగా రూ.1.3 కోట్లు, బీడీ కార్మికులకు జీవనభృతి 36,847 ఉండగా రూ.7.42 కోట్లు, ఒంటరి మహిళలు 4,369 ఉండగా రూ.88 కోట్లు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు 1,127 ఉండగా రూ.2.2 కోట్లు, పైలేరి యా వ్యాధిగ్రస్తులు 513 ఉండగా 1 కోటి నిధులను ప్రభుత్వం జమచేస్తుంది.

పంపిణీలో ఎదురవుతున్న సమస్యలు

ఆసరా పింఛన్లు పంపిణీ బా ధ్యత డీఆర్‌డీఏ అధికారులు ప ర్యవేక్షిస్తుండగా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పిం ఛన్ల పంపిణీలో ఎదురవుతున్న స మస్యలను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకేసమస్య ఎదురవుతు న్న పరిష్కారంలో విఫలమవుతున్నా రు. ప్రతినెలా 5వ తేదీన పెన్షన్‌లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న 25 తేదీ తర్వాత కానీ పంపిణీ కావడం లే దు. ప్రస్తుతం మే నెలలో ఏకంగా 29న మొ దలు పెట్టారు. అయితే సిగ్నల్‌ అందకపోవ డం, ఒకే పోస్టుమెన్‌ ఐదారు గ్రామాలకు ఇ స్తుండడం వీరంతా నాలుగైదు కిలోమీటర్ల లో ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లి తీసుకోవ డం వంటి కారణాలతో పంపిణీ పూర్తయ్యే సరికి 10 రోజులు పడుతుంది. ఇన్ని రోజుల పాటు తమ వంతు ఎ ప్పుడు వస్తుందోనని వృద్ధులు, దివ్యాంగులు పడిగాపులు కాస్తున్నారు.

ప్రభుత్వం నుంచే నిధులు మంజూరు కావడంలో ఆలస్యం..

పింఛన్లకు నిధుల కొర త లేకుండా చూస్తున్నామని రాష్ట్ర ప్ర భుత్వం చెప్పుకొస్తుంది. కానీ, చె ల్లింపులో ఆల స్యం నెలకొంటుంది. దీనికి ప్రధానకార ణం ప్రభుత్వమే నిధు లు పింఛన్ల కు సకాలం లో మంజూ రు చేయడం లేదనే వాదన సంబంధిత శాఖల నుంచి వినిపిస్తుంది. ని ధులు లేకపోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం ప్రతినె లా ఒకటో తేదీన కాకుండా 15 తర్వాత వేస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉండగా ఆసరా పింఛన్ల లబ్దిదారులకు ప్రతినెల 5వ తేదీలోపు ఖాతాలో జమచేయాల్సి ఉండగా నెల చివరిలో 28 దాటితేగాని డబ్బులు రావడం లేదు. 

Updated Date - 2022-05-31T05:49:39+05:30 IST