సెర్ప్ ఉద్యోగులను ఆదుకోండి
ABN , First Publish Date - 2021-05-07T10:10:21+05:30 IST
కరోనా నేపథ్యంలో మరణించిన సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది
గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో మరణించిన సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు కె.నాగరాజు, కార్యదర్శి డి.నానిబాబు గురువారం ఒక ప్రకటన చేశారు. కరోనాతో వివిధ కేడర్లలోని సెర్ప్ సిబ్బంది మరణించారన్నారు. ఉద్యోగం తప్ప ఇతర ఏ ఆధారం లేని ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. సీఎం జోక్యం చేసుకుని సెర్ప్ సిబ్బంది అందరినీ ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ వేయించాలని కోరారు. చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. చనిపోయిన సిబ్బంది కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని, సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని సీఎంని కోరారు.