నా అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి

ABN , First Publish Date - 2020-09-24T09:33:09+05:30 IST

నా అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి

నా అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి

చెరుకు సుధాకర్‌ను కోరిన కోదండరాం

తానే బరిలో ఉంటానన్న సుధాకర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఆయన విజ్ఞప్తిని సుధాకర్‌ సున్నితంగా తిరస్కరించారు. ఆరు నూరైనా తానే బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. బుధవారం ఆదర్శ్‌నగర్‌ లోని తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయానికి కోదండరాం వెళ్లారు. చెరుకు సుధాకర్‌తో టీజేఎస్‌ నేతలు చర్చించారు. కోదండరాం అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. సుధాకర్‌ ససేమిరా అన్నారు. కాగా, తనకు ఉన్న సమాచారం మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5వేలు పంచేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధం అవుతోందని చెరుకు సుధాకర్‌ ఆరోపించారు.ఙ

Updated Date - 2020-09-24T09:33:09+05:30 IST