ట్రావెల్‌ ఇండస్ట్రీని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-09-16T09:03:31+05:30 IST

ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షు

ట్రావెల్‌ ఇండస్ట్రీని ఆదుకోవాలి

ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌మోహన్‌ 



బీచ్‌రోడ్డు, సెప్టెంబర్‌ 15:  ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.విజయ్‌మోహన్‌ కోరారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులోని సబ్‌మెరైన్‌ ఎదురుగా వున్న ఐ లవ్‌ వైజాగ్‌ సింబల్‌ వద్ద టూరిజం ఆపరేటర్లు, ఏజెంట్లు ‘సేవ్‌ టూరిజం, సేవ్‌ ట్రావెల్‌ ఇండస్ట్రీ’ పేరిట ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ట్రావెల్‌ ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోవడంతో ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు.


రాష్ట్రంలో ఈ రంగంపై ఆధారపడిన సుమారు ఆరువేల మంది బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్‌ ధీరజ్‌, విమల్‌ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-16T09:03:31+05:30 IST