అర్హులందరికీ ఆసరా పింఛన్లు
ABN , First Publish Date - 2022-09-10T07:37:44+05:30 IST
ప్రభుత్వం అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించి అండగా నిలుస్లుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.
ఖానాపూర్ రూరల్, సెప్టెంబరు 9 : రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించి అండగా నిలుస్లుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని సత్తెనపల్లి, బీర్నంది, సోమర్పేట్, కోలంగూడ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె ఆసరా పింఛన్ కార్డులను లబ్ధి దారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ మోహిద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాలశంకర్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప సత్యనారా యణరెడ్డి, వైస్ ఎంపీపీ గుగ్లావత్ వాల్సింగ్, బీర్నంది సర్పంచ్ లక్ష్మణ్రావు, ఎర్వచింతల్ సర్పంచ్ కే.గోపాల్, సత్తనపల్లి సర్పంచ్ సీర్లలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజగంగన్న, మాజీ ఎంపీటీసీ కల్లెడ రాజవ్వ, తదిత రులు పాల్గొన్నారు.