హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై నేడు సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2021-09-16T15:30:54+05:30 IST

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ   సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరింది. కోర్టు ఉత్తర్వులలో చాలా అంశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొంది. ఒకటి రెండు అంశాలను తక్షణమే అమలు చేయలేమని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ పిటీషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఈరోజు  విచారణ చేపట్టనుంది. 

Updated Date - 2021-09-16T15:30:54+05:30 IST