పెగాస్‌సపై గురువారం సుప్రీం విచారణ

ABN , First Publish Date - 2021-08-02T07:09:00+05:30 IST

ఇజ్రాయెల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్వో రూ పొందించిన పెగాసస్‌ స్పైవేర్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువా రం విచారించనుంది.

పెగాస్‌సపై గురువారం సుప్రీం విచారణ

 సీజేఐ జస్టిస్‌ రమణ బెంచ్‌ ముందుకు కేసు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఇజ్రాయెల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్వో రూ పొందించిన పెగాసస్‌ స్పైవేర్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువా రం విచారించనుంది. సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, ప్రము ఖ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ వేర్వేరుగా 5 పిటిషన్లు దాఖలు చేశారు. పెగాస్‌సతో ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని కోరారు. ఈ కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం తెలిపింది. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిఘాలో జేమ్స్‌బాండ్‌లా పనిచేసిందని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఆరోపించారు.

Updated Date - 2021-08-02T07:09:00+05:30 IST