కాలుష్య నివారణ చర్యలపై నేడు సుప్రీం కోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-11-24T16:05:02+05:30 IST

ఎన్‌సీఆర్‌లో కాలుష్య నివారణ చర్యలపై బుధవారం సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టనుంది.

కాలుష్య నివారణ చర్యలపై నేడు సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌లో కాలుష్య నివారణ చర్యలపై బుధవారం సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. సమావేశాలు తప్ప.. ఏమీ జరగడం లేదని గత విచారణ సందర్భంగా సీజేఐ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణపై ఎలాంటి చర్యలు తీసుకున్నది, ఎలా అమలు చేస్తున్నది.. స్పష్టతతో రావాలని కేంద్రం, ఢిల్లీ, యూపీ, పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు  ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-24T16:05:02+05:30 IST