కరోనా కిల్లర్ గణేశుడు...

ABN , First Publish Date - 2020-08-13T15:39:11+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గణేశ్ చతుర్థి సందర్భంగా సూరత్ వాసి కరోనా కిల్లర్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు.....

కరోనా కిల్లర్ గణేశుడు...

సూరత్‌లో విగ్రహం తయారీ  

సూరత్ (గుజరాత్): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గణేశ్ చతుర్థి సందర్భంగా సూరత్ వాసి కరోనా కిల్లర్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేసేందుకు వీలుగా కరోనా వైరస్ ను చంపేలా గణేశ్ విగ్రహాన్ని తయారు చేశానని సూరత్ నగరానికి చెందిన ఆశిష్ పటేల్ చెప్పారు. ఈ సారి గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించి పూజలు చేస్తామని ఆశిష్ పటేల్ చెప్పారు. కరోనా కిల్లర్ గణేశ్ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2020-08-13T15:39:11+05:30 IST