కరోనాతో కేంద్రమంత్రి మృతి
ABN , First Publish Date - 2020-09-24T03:10:54+05:30 IST
కరోనాతో కేంద్రమంత్రి మృతి
న్యూఢిల్లీ: రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో కరోనా చికిత్స పొందుతూ ఆయని మరణించారు. 12 రోజులుగా కరోనా చికిత్స పొందారు. కరోనా సోకిందని ఈ నెల 11న స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. సురేష్ అంగడి కర్ణాటక రాష్ట్రం బెళగావి నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.