దగ్గుబాటి సురేష్ బాబును మోసం చేసిన వ్యక్తి ఇతనే

ABN , First Publish Date - 2021-06-23T19:31:48+05:30 IST

దగ్గుబాటి సురేష్ బాబును మోసం చూసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

దగ్గుబాటి సురేష్ బాబును మోసం చేసిన వ్యక్తి ఇతనే

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును మోసం చూసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అరెస్టు చేశారు. వ్యాక్సిన్ టీకాలు ఇప్పిస్తానంటూ సురేష్ బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి కుచ్చటోపీ పెట్టాడు. సురేష్ బాబు సిబ్బందికి టీకాలు ఇప్పిస్తానంటూ రూ. లక్ష వసూలు చేసి పరారయ్యాడు. ఇదే విధంగా అతను పలువురిని మోసం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రముఖ వస్త్ర దుకాణం యజమానిని కూడా నాగార్జునరెడ్డి మోసం చేశాడు. ఓ మంత్రి పేరుతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఇప్పటి వరకు 10 మంది ప్రముఖులను మోసం చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-23T19:31:48+05:30 IST