దేవదాయ శాఖ ఆర్జేసీగా సురేష్‌బాబు బాధ్యతల స్వీకారం

ABN , First Publish Date - 2021-05-18T06:56:53+05:30 IST

దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్జేసీ)గా ఎంవీ సురేష్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దేవదాయ శాఖ ఆర్జేసీగా సురేష్‌బాబు బాధ్యతల స్వీకారం

గోదావరి సిటీ/రాజమహేంద్రవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్జేసీ)గా ఎంవీ సురేష్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన            సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న అన్నవరం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు నుంచి ఆయన  వెంటనే బాధ్యతలు  స్వీకరించారు.  సురేష్‌బాబు గతంలో విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఈవోగా పనిచేసేవారు. అవినీతి ఆరోపణలతో ఆయన్ను అక్కడి నుంచి తొలగించి మొదట్లో ఇక్కడ ఆర్జేసీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కానీ పెండింగులో ఉంచి, అన్నవరం ఈవోకు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. సురేష్‌బాబు దేవదాయ శాఖ మంత్రికి సన్నిహితుడనే ప్రచారం ఉంది. అందువల్లనే ఉత్తర్వులు రాగానే ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.


Updated Date - 2021-05-18T06:56:53+05:30 IST