ప్రధాని మోదీకి ఎంపీ సురేష్ ప్రభు లేఖ
ABN , First Publish Date - 2020-12-03T22:22:50+05:30 IST
ప్రధాని మోదీకి ఎంపీ సురేష్ ప్రభు లేఖ
ఢిల్లీ: ప్రధాని మోదీకి ఎంపీ సురేష్ ప్రభు లేఖ రాశారు. జీడీపీ పుంజుకోవడంపై ప్రధాని మోదీకి సురేష్ ప్రభు అభినందనలు తెలిపారు. ఏపీలో కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడంపై అభ్యంతరం సురేష్ ప్రభు వ్యక్తం చేశారు. దీని వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా..అభివృద్ధి క్షీణిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే నిర్మలా సీతారామన్ను సురేష్ ప్రభు కోరారు.