హంతకులను వదలొద్దు: రైనా
ABN , First Publish Date - 2020-09-02T09:25:46+05:30 IST
ఐపీఎల్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నాక సురేశ్ రైనా తొలిసారిగా స్పందించాడు.
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నాక సురేశ్ రైనా తొలిసారిగా స్పందించాడు. కొద్దిరోజుల క్రితం పంజాబ్లోని తమ బంధువుల కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదం గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. ‘నిజంగా అక్కడ జరిగింది దారుణానికి మించిందనే చెప్పవచ్చు. మా మామయ్య హత్యకు గురయ్యాడు. మేనత్త, నా ఇద్దరు సోదరులు తీవ్ర గాయాలపాలయ్యారు. గతరాత్రి ఓ సోదరుడు కూడా మరణించాడు. మా అత్తయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. హంతకులను వదలొద్దు. వాళ్లను కఠినంగా శిక్షించాలని పంజాబ్ పోలీసులు, సీఎంను కోరుతున్నా’ అని రైనా ట్వీట్ చేశాడు. గతనెల 19న పంజాబ్లోని థరియాల్ గ్రామంలోని రైనా బంధువుల ఇంటిపై దుండగులు దాడి చేశారు.