వైసీపీ వైఫల్యాలే టీడీపీని గెలిపిస్తాయి: కోట్ల సూర్య‌ప్రకాశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-02T23:46:37+05:30 IST

: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశాన్నిగూడూరులో గెలిపిస్తుందని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య‌ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ వైఫల్యాలే టీడీపీని గెలిపిస్తాయి: కోట్ల సూర్య‌ప్రకాశ్‌రెడ్డి

కర్నూలు: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశాన్నిగూడూరులో గెలిపిస్తుందని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య‌ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరలేదు కాబట్టే పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు జరిపిస్తున్నారని చెప్పారు. గ్యాంబ్లింగ్ మట్కా ఎవరు ఆడుతారో పోలీసులకు బాగా తెలుసునని అన్నారు. కేసులన్నీ టీడీపీ వారి మీదే పెడుతున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలనందు బియ్యం ఎవరూ తీసుకోవడం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వాపును చూసి బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేశారు. జమిలీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు తథ్యమని  కోట్ల సూర్య‌ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-02T23:46:37+05:30 IST