Suryapet: సిమెంట్ లారీని ఢీకొన్న డీసీఎం..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-09-07T14:52:16+05:30 IST
కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీని వెనక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి
సూర్యాపేట: కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీని వెనక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దుర్గాపురం స్టేజీ దగ్గర చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.