Telangana: బ్రేకులు ఫెయిలై డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2021-10-04T19:03:09+05:30 IST
జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ వద్ద మిర్యాలగూడ - కోదాడ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
సూర్యాపేట: జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ వద్ద మిర్యాలగూడ - కోదాడ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో రోడ్డు విస్తరణ పనుల్లో డివైడర్ను ఢీ కొట్టి ఆగి పోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు చక్రాలు ఊడి ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు.