తెప్పలు, పడవలపై వెళ్లొద్దు: ఎస్పీ
ABN , First Publish Date - 2020-08-16T01:18:51+05:30 IST
తెప్పలు, పడవలపై వెళ్లొద్దు: ఎస్పీ
సూర్యాపేట: జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ భాస్కరన్ సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో తెప్పలు, పడవలపై వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 83319 40806, 83319 40728 నంబర్లకు సంప్రదించాలని కోరారు.