మరోసారి వివాదాస్పదంగా హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్యలు
ABN , First Publish Date - 2021-07-30T16:48:53+05:30 IST
హుజూర్నగర్ టీఆరెస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చర్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి.
సూర్యాపేట: హుజూర్నగర్ టీఆరెస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చర్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. కాశీ నుండి వచ్చిన సాధువుతో హుజూర్నగర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. సాధువుకు మేళ్ళచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శివలింగానికి సాధువు అభిషేకం నిర్వహించారు. కాగా గర్భగుడిలో నిబంధనలకు విరుద్ధంగా సాధువు పక్కనే ఓ మహిళ పూజలు చేశారు. గతంలో ఓ స్వామిజీ ఇచ్చిన తావిదు వల్లనే ఎమ్మెల్యే అయ్యాడంటూ నార్కెట్పల్లికి చెందిన ఓ స్వామిజీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.