SURYAPETA: మహిళ కళ్లలో కారం కొట్టి..వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ..

ABN , First Publish Date - 2021-08-30T13:26:35+05:30 IST

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళపై దాడి చేశారు. జూన్ 13న తండాలో జరిగిన హత్య కేసులో బెయిల్ పై మహిళ విడుదలై మొదటిసారిగా

SURYAPETA: మహిళ కళ్లలో కారం కొట్టి..వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ..

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళపై దాడి చేశారు. జూన్ 13న తండాలో జరిగిన హత్య కేసులో బెయిల్ పై మహిళ విడుదలై మొదటిసారిగా నిందితురాలు తండాకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటలోని  రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యాడు. ఆ ఊరికే చెందిన బాధితురాలు హత్య కేసులో ఒక నిందితురాలిగా అరెస్టయ్యారు. శంకర్‌నాయక్‌ బంధువులతో ఆమెకు పాతకక్షలున్నాయి. బెయిల్ పై మహిళ విడుదలై  తండాకు రావడంతో ప్రతీకారంతో మృతుడి బంధువులు గ్రామంలో అందరూ చూస్తుండగా కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ ఆ మహిళపై మృతుడి బంధువులు దాడి చేశారు.

Updated Date - 2021-08-30T13:26:35+05:30 IST