సూర్యాపేటలో రూ.13 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్

ABN , First Publish Date - 2021-06-10T16:13:40+05:30 IST

నకిలీ విత్తనాల దందా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో విత్తనాలను సీజ్‌ చేశారు

సూర్యాపేటలో రూ.13 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్

సూర్యాపేట: నకిలీ విత్తనాల దందా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో విత్తనాలను సీజ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా మిరప విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి నకిలీ విత్తనాలు వాటి విలువ సుమారుగా రూ.13 కోట్ల ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా విత్తనాలను రైతులకు అంటగడితే చూస్తు ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2021-06-10T16:13:40+05:30 IST