మా సుప్రీం కమాండర్ నితీశే : సుశీల్ మోదీ
ABN , First Publish Date - 2020-06-07T16:53:09+05:30 IST
ఎన్డీయే పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారేనని ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పునరుద్ఘాటించారు. తమ
పాట్నా : ఎన్డీయే పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారేనని ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పునరుద్ఘాటించారు. తమ సంకీర్ణానికి సుప్రీం కమాండర్ ఆయనే అని తేల్చి చెప్పారు. బీజేపీ నితీశ్కు మద్దతిచ్చినా, ఇవ్వక పోయినా తాము మాత్రం బీజేపీతోనే అని భాగస్వామ్య పక్షమైన ఎల్జేపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ సుశీల్ మోదీ పై విధంగా ప్రకటించారు.
‘‘ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ... ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రకటించారు. యుద్ధం మధ్యలో ఉన్న సమయంలో సారథిని మార్చం. గత 20 ఏళ్ల నుంచి ఎన్డీయే కమాండర్గా నితీశే కొనసాగుతున్నారు’’ అని మోదీ ప్రకటించారు.