యోగా గురు ఆశ్రమంలో సుశీల్‌?

ABN , First Publish Date - 2021-05-15T09:24:26+05:30 IST

హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

యోగా గురు ఆశ్రమంలో సుశీల్‌?

న్యూఢిల్లీ: హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, సుశీల్‌ హరిద్వార్‌లోని ఓ ప్రముఖ యోగా గురు ఆశ్రమంలో ఉన్నట్టు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. సుశీల్‌ స్నేహితుడు, రోహ్‌తక్‌కు చెందిన భూరా.. ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పాడట. స్వయంగా తానే హరిద్వార్‌లోని యోగా గురు ఆశ్రమానికి తీసుకెళ్లినట్టు తెలిపాడట. ఈ నెల 4న ఛత్రశాల స్టేడియంలో 23 ఏళ్ల రెజ్లర్‌ సాగర్‌ హత్యకేసులో సుశీల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అతడి ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసు కూడా జారీ చేశారు. 


Updated Date - 2021-05-15T09:24:26+05:30 IST