అనుమానాస్పద స్థితిలో కడప జిల్లా వాసి మృతి
ABN , First Publish Date - 2021-01-21T06:16:18+05:30 IST
కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కడప జిల్లా నాగరాజుపేటకు చెందిన కంతురి గంగాధర్ బుధవారం బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
సర్పవరం జంక్షన్, జనవరి 20: కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కడప జిల్లా నాగరాజుపేటకు చెందిన కంతురి గంగాధర్ బుధవారం బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గంగాధర్ వాకలపూడిలో న్యూ జెమిని ఆయిల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఏడాదిగా వాకలపూడిలోని రామకృష్ణనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం బాత్రూమ్లో మృతి చెంది ఉన్నాడు. వీఆర్వో ముసలయ్య ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం ఎస్ఐ ఎస్.శంకర్ సంఘటనా స్థలానికి వెళ్లి గంగాధర్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించామని, వివరాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.