యువతి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-01-25T06:53:07+05:30 IST
ఫ్యాన్కు ఉరివేసుకుని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పెంటపాడు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అలంపురం గ్రామానికి చెందిన దేవళ్ళ మేరీ ప్రసన్న (29) ఎంబీఏ పూర్తి చేసింది.
పెంటపాడు, జనవరి 24: ఫ్యాన్కు ఉరివేసుకుని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పెంటపాడు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అలంపురం గ్రామానికి చెందిన దేవళ్ళ మేరీ ప్రసన్న (29) ఎంబీఏ పూర్తి చేసింది. తండ్రి విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉపాధ్యాయినిగా పని చేసి రిటైరైన తల్లి వద్దే ఈమె ఉంటోంది. తమ కుటుంబానికి ఎవరూ తోడు లేరంటూ మృతురాలు తరచూ ఆవేదన చెందుతుండేదన్నారు. శనివారం రాత్రి తన గదిలోకి వెళ్ళిన ప్రసన్న ఆదివారం సాయంత్రం వరకూ బయటకు రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టి వెళ్ళి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించిందని, సోమవారం ఉదయం మృతురాలి తల్లి సత్యవతి పెంటపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.