ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభ్యంపై వీడని సస్పెన్స్

ABN , First Publish Date - 2021-12-08T17:15:48+05:30 IST

ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో లభ్యమైన డెడ్ బాడీ ఎవరిది అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇది హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభ్యంపై వీడని సస్పెన్స్

హైదరాబాద్: ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో లభ్యమైన డెడ్ బాడీ ఎవరిది అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇది హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటర్ ట్యాంక్‌పై లభ్యమైన చెప్పుల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ట్యాంక్‌లో డెడ్ బాడీ లభ్యం అయినపుడు ట్యాంక్ మూతలు మూసి ఉన్నాయి. దీంతో ఎవరైనా ఆ వ్యక్తిని చంపి అందులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు ట్యాంక్‌పై మద్యం తాగిన ఆనవాళ్లున్నాయి. డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయి ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది. 15 రోజుల క్రితం నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. డెడ్ బాడీ ఆ మిస్ అయిన యువకుడిదా కాదా? అన్నదానిపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.


Updated Date - 2021-12-08T17:15:48+05:30 IST