ఆ పోలీసులను సస్పెండ్‌ చేయండి

ABN , First Publish Date - 2021-05-14T08:52:43+05:30 IST

రాజమహేంద్రవరంలో వైద్య సిబ్బందిపై దాడి చేసిన సీఐ దుర్గాప్రసాద్‌, ఇతర సిబ్బందిని తక్షణం స స్పెండ్‌ చేయాలని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యద్శులు ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, బి.శ్రీని

ఆ పోలీసులను సస్పెండ్‌ చేయండి

వైద్య సిబ్బందిపై దాడి సంఘటనలో ఏపీ ఎన్జీవో నేతల డిమాండ్‌

విజయవాడ(పాయకాపురం), మే 13: రాజమహేంద్రవరంలో వైద్య సిబ్బందిపై దాడి చేసిన సీఐ దుర్గాప్రసాద్‌, ఇతర సిబ్బందిని తక్షణం స స్పెండ్‌ చేయాలని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యద్శులు ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, బి.శ్రీనివాసరావులు ప్రభుత్వాన్ని, డీజీపీ గౌతం సవాంగ్‌లను కోరా రు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కర్ఫ్యూ మాటున ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. గుర్తింపు కార్డులను చూపినా పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని చూస్తే, ఇక మీదట ఆరోగ్య శాఖ సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితులు కల్పించిన వారవుతారన్నారు. హేమలత దంపతులపై అమానుషంగా ప్రవర్తించిన సీఐ దుర్గాప్రసాద్‌ ఇతర సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని కోరారు. 

Updated Date - 2021-05-14T08:52:43+05:30 IST