ఇద్దరు వీఆర్ఏల సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-09-23T10:10:04+05:30 IST
దుండిగల్ మండలం చర్చిగాగిల్లాపూర్లోని సర్వేనెంబర్-214లో గల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడంలో విఫలమైన ఇద్దరు
దుండిగల్, సెప్టెంబర్22 (ఆంధ్రజ్యోతి): దుండిగల్ మండలం చర్చిగాగిల్లాపూర్లోని సర్వేనెంబర్-214లో గల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడంలో విఫలమైన ఇద్దరు వీఆర్ఏలను సస్పెండ్ చేస్తూ తహసీల్దార్ భూపాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వీఆర్ఏలుగా పనిచేస్తున్న వినోద్, నగే్షలు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిందిపోయి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు.