అడ్డగూడూరు లాకప్‌ డెత్‌ కేసులో పోలీసులపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-06-23T02:35:16+05:30 IST

అడ్డగూడూరు లాకప్‌ డెత్‌ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు

అడ్డగూడూరు లాకప్‌ డెత్‌ కేసులో పోలీసులపై సస్పెన్షన్ వేటు

యాదాద్రి: అడ్డగూడూరు లాకప్‌ డెత్‌ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేసారు. మూడు రోజుల క్రితం పీఎస్‌లో మరియమ్మ(45) అనే మహిళ చనిపోయింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపారు. ఎస్సై, కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. దర్యాప్తు ఆధారంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-06-23T02:35:16+05:30 IST