అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-08T04:57:26+05:30 IST

అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

శృంగవరపుకోట రూరల్‌, మే 7: అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అలుగుబిల్లి గ్రామానికి చెందిన పొడుగు అప్పలరాజు(36) ఎస్‌.కోటలో మామిడి పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజూ లాగే శుక్రవారం ఎస్‌.కోటలో వ్యాపారం ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. పండ్ల అట్టలకు సంబంధించి తన బంధువు పొడుగు వెంకటరావు కుటుంబంతో వివాదం చెలరేగింది. అయితే పాత కక్షలను మనసులో పెట్టుకొని పొడుగు వెంకటరావుతో పాటు ఆయన కుటుంబానికి చెందిన చెన్నా వెంకట ఎర్నిబాబు, చెన్నా సరస్వతి కలిసి కర్రలు, బ్యాటుతో తన భర్త అప్పలరాజును కొట్టి తీవ్ర గాయపరిచారని సన్యాసమ్మ తెలిపారు. గాయపడి న అప్పలరాజును బైకుపై ఎస్‌.కోట ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా, సమీప ఒన్‌వే ట్రాఫిక్‌ జంక్షన్‌ వద్ద మృతిచెందారు. దీనిపై అప్పలరాజు భార్య సన్యాసమ్మ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మృతుడి ఒంటిపై గాయాలు కనిపించ ని కారణంగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గొంప రాజేష్‌ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు మూడేళ్ల కుమారుడు ఉన్నారు.

 

Updated Date - 2021-05-08T04:57:26+05:30 IST