పోలీసు అధికారికి బెదిరింపులు.. సువేందుపై కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-07-21T04:58:33+05:30 IST

పోలీసు అధికారిని బెదిరించిన ఆరోపణలపై పోలీసులు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారీపై కేసు నమోదు చేశారు. కశ్మీర్‌కు ట్రాన్సఫర్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ పూర్బా మెడ్నీపూర్ జిల్లా పోలీస్‌ బాస్‌ను బెదిరించారనేది సువేందుపై మోపిన ప్రధాన ఆరోపణ.

పోలీసు అధికారికి బెదిరింపులు.. సువేందుపై కేసు నమోదు!

కోల్‌కతా: పోలీసు అధికారిని బెదిరించిన ఆరోపణలపై పోలీసులు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారీపై కేసు నమోదు చేశారు. కశ్మీర్‌కు ట్రాన్సఫర్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ పూర్బా మెడ్నీపూర్ జిల్లా పోలీస్‌ బాస్‌ను బెదిరించారనేది సువేందుపై మోపిన ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా.. తృణమూల్ కాంగ్రెస్‌కు, సదరు అధికారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులు కూడా తన వద్ద ఉన్నాయని సువేందు హెచ్చరించారని సమాచారం. సువేందుతో పాటూ మరో పధ్నాలుగు మంది సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-21T04:58:33+05:30 IST